కరోనా వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు పాలవుతున్నాయి: పవన్
ABN , First Publish Date - 2020-07-05T22:40:52+05:30 IST
కరోనా వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు పాలవుతున్నాయని జనసేనాని పవన్కల్యాణ్ చెప్పారు. ఇలాంటి తరుణంలో పాలకులు సహృదయంతో స్పందించాలని కోరారు.
అమరావతి: కరోనా వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు పాలవుతున్నాయని జనసేనాని పవన్కల్యాణ్ చెప్పారు. ఇలాంటి తరుణంలో పాలకులు సహృదయంతో స్పందించాలని కోరారు. ఉన్న పథకాలను కొనసాగిస్తూ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లా నేస్తం నిధులు నిలిపివేయడం సమంజసం కాదన్నారు. న్యాయవాదుల సంక్షేమంకు రూ.100 కోట్లు ఇస్తామని జీవో ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని పవన్కల్యాణ్ ఆరోపించారు.