నెల్లూరు పోలింగ్ కేంద్రంలో కరోనా కలకలం.. నిలిపివేత

ABN , First Publish Date - 2021-04-17T18:40:41+05:30 IST

పోలింగ్ కేంద్రంలో కరోనా కలకలం సృష్టించింది.

నెల్లూరు పోలింగ్ కేంద్రంలో కరోనా కలకలం.. నిలిపివేత

నెల్లూరు : జిల్లాలోని కలువాయి మండలం పేరంకొండ పోలింగ్ కేంద్రంలో కరోనా కలకలం సృష్టించింది. పోలింగ్ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిపోయింది. ప్రస్తుతం ఆ పోలింగ్ అధికారిని ప్రత్యేక గదిలో ఉంచారు. ఈ విషయం పోలింగ్ కేంద్రం బయట బారులు తీరిన జనాలకు తెలియడంతో లోనికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన శానిటైజేషన్ సిబ్బంది గ్రామంలో శానిటేషన్ చేస్తున్నారు. అయితే పోలింగ్ మధ్యాహ్నం తర్వాత మళ్లీ తిరిగి ప్రారంభం అవుతుందా..? లేకుంటే పూర్తిగా ఆపేస్తారా..? అనేది తెలియరాలేదు.

Updated Date - 2021-04-17T18:40:41+05:30 IST