పంజాబ్ నుంచి తిరుమలకు వచ్చిన స్థానికుడికి కరోనా?
ABN , First Publish Date - 2020-04-01T04:18:58+05:30 IST
పంజాబ్ నుంచి తిరుమలకు వచ్చిన స్థానికుడికి కరోనా లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో..
తిరుమల: పంజాబ్ నుంచి తిరుమలకు వచ్చిన స్థానికుడికి కరోనా లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో అతనిని కుటుంబ సభ్యులు అశ్విని ఆస్పత్రికి తరలించారు. కరోనా లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షల కోసం తిరుపతి రుయాకు తరలించారు.
కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరాయి. కొత్తగా మరో నాలుగు పాజిటివ్ కేసులను వైద్యులు గుర్తించారు. ఈ నలుగురు కూడా ఢిల్లీలో మతపరమైన ప్రార్ధనలకు హాజరై విశాఖకు వెళ్లినట్లు తెలిపారు. ఒక్క విశాఖలోనే ఇప్పటి వరకూ 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్పారు.
అటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కరోనా వైరస్ అలజడి రేగింది. ఢిల్లీకి ప్రార్థనలకు వెళ్లిన ముస్లింలు స్థానిక మసీదులో ఉన్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజులుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్ ఉండగా రోడ్డు మీదకు ఎలా వచ్చారంటూ స్థానికులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు.