గూడూరు కరోనా కేర్ సెంటర్లో పరిస్థితి దారుణం
ABN , First Publish Date - 2020-08-10T02:35:02+05:30 IST
గూడూరు గాంధీనగర్ కోవిడ్ కేర్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రంలో సరైన వసతులు లేవని..
నెల్లూరు: గూడూరు గాంధీనగర్ కోవిడ్ కేర్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రంలో సరైన వసతులు లేవని కరోనా పేషెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. పేషెంట్లు క్వారంటైన్ కేంద్రం బయటకు వచ్చి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా తమకు టాబ్లెట్లు ఇవ్వడంలేదని కనీసం వేడి నీరు కూడా పోయడంలేదని వాపోయారు. సుమారు 600ల మంది ఉన్న కోవిడ్ సెంటర్లో కనీసం తాగు నీరు ఏర్పాటు చేయలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వచ్చిన రోగుల్లో బీపీ, షుగర్ ఉన్న వాళ్లు కూడా ఉన్నారని, వారికి కూడా కనీసం ఎటువంటి ట్యాబ్లెట్స్ ఇవ్వలేదని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వసతులు కల్పించాలని కరోనా రోగులు కోరుతున్నారు.
కోవిడ్