వరంగల్ ఎంజీఎంలో యువకుడి మృతి.. వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని..!

ABN , First Publish Date - 2020-07-14T03:17:03+05:30 IST

వరంగల్ ఎంజీఎంలో మరో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో 28 సంవత్సరాల యువకుడు మృతి చెందారు. హన్మకొండకు..

వరంగల్ ఎంజీఎంలో యువకుడి మృతి.. వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని..!

వరంగల్ : వరంగల్ ఎంజీఎంలో మరో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో 28 సంవత్సరాల యువకుడు మృతి చెందారు. హన్మకొండకు చెందిన యువకుడు కరోనా లక్షణాలతో ఈనెల 9న ఎంజీఎంలో చేరాడు. కరోనా టెస్టులు చేయాలని యువకుడి తండ్రి కాళ్లవేళ్ల బడటంతో శనివారం శాంపిల్స్ తీసుకున్నారు. రిపోర్ట్‌లు ఇంకా వెల్లడించలేదు. సోమవారం సాయంత్రం యువకుడు మృతి చెందాడు. సరైన వైద్యం అంది ఉంటే తమ కుమారుడు బతికేవాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-07-14T03:17:03+05:30 IST