కరోనా నెగిటివ్.. అనగానే మరణించిన వృద్ధుడు

ABN , First Publish Date - 2020-07-17T00:04:39+05:30 IST

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ మాట వింటేనే గజగజవణికిపోతున్నారు. కరోనా వచ్చిన వారి కంటే.. ఆ భయంతో చనిపోయేవాళ్లు ఎక్కువైపోతున్నారు. ఇటీవల

కరోనా నెగిటివ్.. అనగానే మరణించిన వృద్ధుడు

ఏలూరు: కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ మాట వింటేనే గజగజవణికిపోతున్నారు. కరోనా వచ్చిన వారి కంటే.. ఆ భయంతో చనిపోయేవాళ్లు ఎక్కువైపోతున్నారు. ఇటీవల కరోనా వస్తుందేమోనన్న భయంతో చాలా మంది ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏలూరులో జరిగిన ఘటన చూశాక.. కరోనా భయం ఎంతగా వెంటాడుతుందో తేటతెల్లమవుతోంది. ఇటీవల ఏలూరులో సంజీవని బస్సు వద్ద ఓ వృద్ధుడు కరోనా టెస్టులు చేయించుకున్నాడు. అయితే టెస్టుల్లో నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. ఆ వార్తను కుమారుడు.. తన తండ్రితో పంచుకుంటూ కరోనా నెగిటివ్ వచ్చిందంటూ తెలియజేశాడు. కానీ దాని అర్థం తెలియక అక్కడనే వృద్ధుడు కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే వృద్ధుడు కన్నుమూశాడు. అక్కడి వారు సపర్యాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వృద్ధుడు కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated Date - 2020-07-17T00:04:39+05:30 IST