కరోనా మహమ్మారికి మరో జర్నలిస్టు బలి

ABN , First Publish Date - 2020-08-05T03:38:24+05:30 IST

కరోనా మహమ్మారికి మరో జర్నలిస్టు బలయ్యాడు. చిన్నగుట్టిగట్టు మండలం ప్రజాశక్తి విలేకరి భాస్కర్ కరోనా భారిన పడి చనిపోయాడు. భాస్కర్‌కు గత వారం రోజులుగా జ్వరం వచ్చింది. దాన్ని

కరోనా మహమ్మారికి మరో జర్నలిస్టు బలి

తిరుపతి : కరోనా మహమ్మారికి మరో జర్నలిస్టు బలయ్యాడు. చిన్నగుట్టిగట్టు మండలం ప్రజాశక్తి విలేకరి భాస్కర్ కరోనా భారిన పడి చనిపోయాడు. భాస్కర్‌కు గత వారం రోజులుగా జ్వరం వచ్చింది. దాన్ని మామూలు జ్వరం అనుకున్నాడు. అయితే జ్వరం తీవ్రత మరింత పెరుగుతుండటంతో గ్యారంపల్లె పీహెచ్‌సి వైద్యులను సంప్రదించాడు. శనివారం భాస్కర్‌కు శ్వాబ్ టెస్టు చేసిన వైద్యులు.. రిజల్ట్ రాకముందే తిరుపతి కోవిడ్ ఆస్పత్రిలో చేరాలని సిఫార్సు చేశారు. దీంతో భాస్కర్ తిరుపతి కోవిడ్ ఆస్పత్రిలో చేరాడు. సోమవారం అతనికి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఇవాళ చికిత్స పొందుతూ భాస్కర్ తుదిశ్వాస విడిచాడు.

Updated Date - 2020-08-05T03:38:24+05:30 IST