జగన్ నివాసం వద్ద కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-07-04T22:08:54+05:30 IST

తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద కరోనా కలకలం రేపుతోంది. 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన

జగన్ నివాసం వద్ద కరోనా కలకలం

అమరావతి: తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద కరోనా కలకలం రేపుతోంది. 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8 మంది సెక్యూరిటీ గార్డులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. మరో బెటాలియన్‌కు చెందిన ఇద్దరు గార్డులు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ నెల 2న సీఎం నివాసం వద్ద గార్డులకు కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే టెస్టుల ఫలితాలను ఈ రోజు వెల్లడించారు. ఈ పలితాల్లో పది మంది వైరస్ నిర్ధారణ అయింది. దీంతో సీఎం కార్యాలయం కలకలం మొదలైంది. గతంలో సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది. 

Updated Date - 2020-07-04T22:08:54+05:30 IST