ఎక్స్కవేటర్తో కరోనా మృతుడి ఖననం
ABN , First Publish Date - 2020-07-07T08:44:30+05:30 IST
తిరుపతిలో ఓ వృద్ధుడి మృతదేహాన్ని ఎక్స్కవేటర్ సాయంతో ఖననం చేయడం ..
తిరుపతిలో అమానవీయ ఘటన
తిరుపతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఓ వృద్ధుడి మృతదేహాన్ని ఎక్స్కవేటర్ సాయంతో ఖననం చేయడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. తిరుపతికి చెందిన వృద్ధుడు (75) కరోనా బారిన పడి స్విమ్స్లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. మృతదేహం బరువు సుమారు 170 కిలోలు ఉండడంతో గోవిందధామం (గ్యాస్ ఆధారిత దహనవాటిక) అంత్యక్రియలకు వీలుకాక తిరిగి మార్చురీకి తరలించారు.
ఆదివారం అంబులెన్సులో హరిశ్చంద్ర శ్మశానవాటికకు తరలించారు. అయితే అంబులెన్సు నుంచి సిబ్బంది మృత దేహాన్ని దించలేక ఎక్స్కవేట ర్ తొట్టెలో వేసి గోతిలో పూడ్చిపెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. మృతుడి భారీకాయం కారణంగా అంత్యక్రియలు క్లిష్టంగా మారాయని, అతడి కుటుంబీకుల అనుమతితోనే ఎక్స్కవేటర్తో చేశామని కమిషనరు గిరీష, ఆర్డీవో కనకనరసారెడ్డి తెలిపారు.