ఏపీలో కరోనా విజృంభణ

ABN , First Publish Date - 2022-01-27T23:05:34+05:30 IST

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని కరోనా

ఏపీలో కరోనా విజృంభణ

అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 22,36,047కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 14,579 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,09,493 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,11,975 మంది రికవరీ చెందారు.


దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,385 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవగా...573 మంది మృతి చెందారు. దాదాపు 3,06,357 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారీ కొవిడ్ పాజిటివీటీ రేటు 19.59 శాతంగా నమోదు అయ్యింది. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,63,84,39,207గా ఉంది. 

Updated Date - 2022-01-27T23:05:34+05:30 IST