అలర్ట్.. కరోనా రోగికి దగ్గరగా ఉన్నారు?
ABN , First Publish Date - 2020-04-03T07:06:27+05:30 IST
కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్తే వెంటనే అప్రమత్తం చేసే ‘ఆరోగ్య సేతు’ అనే ఒక యాప్ను కేంద్రం రూపొందించింది. ఇది ఎడ్జ్, బ్లూటూత్ టెక్నాలజీ, అల్గారిథంలు...
అప్రమత్తం చేసే ఆరోగ్యసేతు యాప్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్తే వెంటనే అప్రమత్తం చేసే ‘ఆరోగ్య సేతు’ అనే ఒక యాప్ను కేంద్రం రూపొందించింది. ఇది ఎడ్జ్, బ్లూటూత్ టెక్నాలజీ, అల్గారిథంలు, కృత్రిమ మేధ ఆధారంగా పని చేస్తుంది. దీనిని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే.. కరోనా సోకిన రోగికి సమీపానికి వెళ్లిన వెంటనే హెచ్చరిస్తుంది. అయితే, తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మాత్రమే ఇది పని చేస్తుంది.