కోర్ కమిటీ భేటీ ఏర్పాటు చేయండి: వీహెచ్
ABN , First Publish Date - 2020-08-11T09:16:14+05:30 IST
కోర్ కమిటీ భేటీ ఏర్పాటు చేయండి: వీహెచ్
హైదరాబాద్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమస్యలు, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పలు అంశాలపైన చర్చించేందుకు టీపీసీసీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిని పీసీసీ మాజీ చీఫ్ వి.హన్మంతరావు కోరారు. సోషల్ మీడియా వేదికగా తనపై విమర్శలు చేస్తున్నారని, ఈ అంశంపైనా చర్చించాల్సి ఉందన్నారు. కాగా, జ్యోతిరావ్పూలే విగ్రహ ధ్వంసం ఘటనపై నిరసన వ్యక్తం చేసేందుకు మంగళవారం నాడు వరంగల్కు వీహెచ్ వెళ్లనున్నారు.