శ్రీశైలంలో తామ్ర శాసనాలు
ABN , First Publish Date - 2021-06-14T09:22:37+05:30 IST
శ్రీశైలంలో ఘంటామఠం జీర్ణోద్ధరణ పనులు నిర్వహిస్తుండగా ఆదివారం 21 తామ్ర శాసనాలు లభ్యమయ్యాయి. ఈ శాసనాలలో కొన్ని సంస్కృత భాషలో, మరికొన్ని తెలుగు లిపిలో ఉన్నాయి.
శ్రీశైలం, జూన్ 13: శ్రీశైలంలో ఘంటామఠం జీర్ణోద్ధరణ పనులు నిర్వహిస్తుండగా ఆదివారం 21 తామ్ర శాసనాలు లభ్యమయ్యాయి. ఈ శాసనాలలో కొన్ని సంస్కృత భాషలో, మరికొన్ని తెలుగు లిపిలో ఉన్నాయి. దేవస్థానం ఈవో కేఎస్ రామారావు, కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్, సీఐ బీవీ రమణ తామ్ర శాసనాలకు పంచనామా చేసి, మైసూరులోని భారత పురాతత్వ సర్వే సంస్థ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి తామ్ర పత్రాలపై ఉన్న శాసనాలను వీడియోకాల్ ద్వారా చూపించారు. వాటిని పరిశీలించిన ఆయన... శాసన లిపిని బట్టి 14-16 శతాబ్దాల నాటివిగా భావిస్తున్నామని తెలిపారు.