చంద్రబాబును అంతం చేసేందుకు కుట్ర

ABN , First Publish Date - 2022-08-27T08:34:56+05:30 IST

చంద్రబాబును అంతం చేసేందుకు కుట్ర

చంద్రబాబును అంతం చేసేందుకు కుట్ర

సవాంగ్‌కు ఏగతి పట్టిందో పోలీసులు గుర్తుంచుకోవాలి: బుద్దా 

విజయవాడ(వన్‌టౌన్‌), ఆగస్టు 26: రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును అంతం చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. కుప్పంలో వైసీపీ శ్రేణుల అరాచకాలకు నిరసనగా శుక్రవారం విజయవాడలో చేపట్టిన నిరసనలో మాట్లాడారు. ‘‘గౌతం సవాంగ్‌కు ఏగతి పట్టిందో పోలీ సు అధికారులు గుర్తుంచుకోవాలి. అఽధికారం ఎప్పుడూ శాశ్వతం కాద ని తెలుసుకోవాలి. పోలీసులు నారా భువనేశ్వరిపై చెడు మాటలు మాట్లాడించిన దుర్మార్గుడు జగన్‌. జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు ఆంక్షలు విధించలేదు. అన్న క్యాంటీన్లను టీడీపీ సొంతంగా నిర్వహిస్తుంటే అడ్డుకుంటున్నాడు. జగన్‌ దేశంలోనే ఏకైక పిచ్చి ఉన్మాద సీఎం’’ అని బుద్దా వెంకన్న అన్నారు. మరోనేత నాగుల్‌మీరా మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్‌ వెన్నులో వణుకు పుడుతోందన్నారు.  

Updated Date - 2022-08-27T08:34:56+05:30 IST