మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్ర కేసు

ABN , First Publish Date - 2022-03-17T02:18:22+05:30 IST

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో నిందితుల కస్టడీ

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్ర కేసు

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో నిందితుల కస్టడీ కోసం వేసిన పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది. మేడ్చల్‌ 22వ మెట్రోపాలిటన్‌ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. ఇద్దరు నిందితులను మరోసారి కస్టడీ కోసం పోలీసులు కోరారు. రాఘవేందర్‌రాజు, మున్నూరు రవిని పోలీసులు కస్టడీకి కోరారు. అయితే ఇద్దరిని మాత్రమే ఎందుకు కస్టడీ కోరుతున్నారని కోర్టు ప్రశ్నించింది. గత కస్టడీలో వీరిద్దరినీ ఎందుకు ప్రశ్నించలేదని కోర్టు ప్రశ్నించింది. నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై రేపు తీర్పును కోర్టు వెల్లడించనున్నది. పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలను సెషన్స్‌ కోర్టు విన్నది.  

Updated Date - 2022-03-17T02:18:22+05:30 IST