ఆ 15 అంశాలను పరిగణలోకి తీసుకోండి: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-04-10T19:50:47+05:30 IST

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తక్కువ కాలంలోనే మూడో దశకు చేరుకోవడం ప్రమాదకరమని..

ఆ 15 అంశాలను పరిగణలోకి తీసుకోండి: చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తక్కువ కాలంలోనే మూడో దశకు చేరుకోవడం ప్రమాదకరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ తీర్మానించిన 15 అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం జగన్‌కు ఈ మేరకు చంద్రబాబు లేఖ రాశారు. మొదటి, రెండు దశల్లోనే వైరస్ వ్యాప్తిని నిరోధించి ఉంటే.. ఈ ప్రమాదం వాటిల్లేదికాదని.. నిపుణులే చెబుతున్నారని అన్నారు. కరోనా తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునే ఉన్నామని అన్నారు.


విశాఖ మెడ్ టెక్ జోన్‌పై పూర్తి శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సాయాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలే మిన్నగా పనిచేసి ప్రస్తుత కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని చంద్రబాబు సూచించారు.


Updated Date - 2020-04-10T19:50:47+05:30 IST