తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: వీహెచ్

ABN , First Publish Date - 2020-07-13T23:49:33+05:30 IST

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: వీహెచ్

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: వీహెచ్

హైదరాబాద్: కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతోందన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ వంటి సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ కరోనా సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే హరితహారం, ప్రాజెక్టుల పేరుతో దృష్టి మళ్లిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనాపై బీజేపీ, టీఆర్ఎస్ దాగుడు మూతలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌తో కరోనా‌పై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. 


Updated Date - 2020-07-13T23:49:33+05:30 IST