కాంగ్రెస్ సీనియర్ నేత KVP ఇంట్లో భారీ చోరీ

ABN , First Publish Date - 2022-05-31T16:09:48+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (kvp ramachandra rao) ఇంట్లో చోరీ జరిగింది.

కాంగ్రెస్ సీనియర్ నేత KVP ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (kvp ramachandra rao) ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 46 లక్షలు విలువ గల 49 గ్రాముల డైమండ్ నెక్లెస్ మాయమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డైమండ్ నెక్లెస్ మాయంపై కేవీపీ భార్య సునీత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 11న సునీత తెలుపు రంగు డైమండ్ నెక్లెస్ ధరించి  ఓ ఫంక్షన్‌కు వెళ్ళారు. ఫంక్షన్ నుండి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం బెడ్ రూమ్‌లో నెక్లెస్‌ను పెట్టగా... కొద్దిసేపటికే నెక్లెస్ మాయమవడంతో సునీత ఇళ్లంతా వెతికారు. డైమండ్ నెక్లెస్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ రెండు రోజుల క్రితం కేవీపీ భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు.

Updated Date - 2022-05-31T16:09:48+05:30 IST