వరద సాయం గోల్‌మాల్‌పై కేసీఆర్‌కు రేవంత్ లేఖ

ABN , First Publish Date - 2020-11-01T01:07:31+05:30 IST

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘గ్రేటర్‌లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయి. శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా వరద బాధితుల సాయంలోనూ కమీషన్లు దండుకున్నారు. మీ కార్పొరేటర్లు, స్థానిక

వరద సాయం గోల్‌మాల్‌పై కేసీఆర్‌కు రేవంత్ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘గ్రేటర్‌లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయి. శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా వరద బాధితుల సాయంలోనూ కమీషన్లు దండుకున్నారు. మీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులను చూస్తే వీళ్లు మనుషులేనా, మానవత్వం ఉందా అనిపిస్తోంది. గ్రేటర్‌లో ఓట్లు దండుకోవాలన్న మీ దుర్భుద్ధే ఈ స్కాంకు కారణం. చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారు. మీ అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి. రెండు రోజుల్లో తిరిగి పరిహారం పంపిణీ మొదలు పెట్టాలి. ఇప్పటి వరకు జరిగిన దోపిడీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి’ అని లేఖలో రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-11-01T01:07:31+05:30 IST