బండి సంజయ్ ఓ డమ్మీ: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-09-07T22:30:02+05:30 IST

ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర బీజేపీ

బండి సంజయ్ ఓ డమ్మీ: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

 హైదరాబాద్‌: ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ డమ్మీ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. "నీకు దమ్ముంటే ప్రధానితో ప్రతి అకౌంట్‌లో 15లక్షలు వేయించు" అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోయి హుజురాబాద్ ఉపఎన్నికలు వాయిదా వేసుకున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక, పీసీసీ కమిటీ సభ్యులందరూ కలిసి రాహుల్‌ను కలవాలని మొదటి రోజే అనుకున్నామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-07T22:30:02+05:30 IST