కేసీఆర్పై కాంగ్రెస్ నేతల విమర్శలు
ABN , First Publish Date - 2020-12-12T22:41:46+05:30 IST
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేతల విమర్శలు గుప్పించారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ అలయ్ బలయ్ తీసుకుంటున్నాయని
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేతల విమర్శలు గుప్పించారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ అలయ్ బలయ్ తీసుకుంటున్నాయని ఆరోపించారు. కేసీఆర్ రైతులను నిండా ముంచుతున్నారని, సన్న వరి పండించిన రైతులకు ఎకరానికి 10వేలు పరిహారం ఇవ్వాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్బంధం వల్ల పంట దిగుబడి తగ్గిందని, రైతులకు ప్రభుత్వం కనీసం సహాయం కూడా చేయలేదని ఆయన దుయ్యబట్టారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని కూడా ప్రభుత్వం అంచనా వేయలేదని జీవన్రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం శుద్ధ అబద్ధమని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ ఏం రాజకీయ ప్రయోజనాల ఆశించి ఢిల్లీకి వెళ్లారని చిన్నారెడ్డి ప్రశ్నించారు.