Sonia త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నాం: Batti
ABN , First Publish Date - 2022-06-03T15:29:21+05:30 IST
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీకి కొవిడ్ వచ్చిందని... త్వరగా కోలుకోవాలని పూజ చేశామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ(Sonia gandhi)కి కొవిడ్ వచ్చిందని... త్వరగా కోలుకోవాలని పూజ చేశామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క(Batti vikramarka) అన్నారు. శుక్రవారం ఉదయం చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి కాంగ్రెస్ నేతలు భట్టి ,వీహెచ్ ,సీతక్క ఇతర ముఖ్య నేతలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ నిండు నూరేళ్ళు బతకాలని అమ్మవారికి పూజలు చేశామని భట్టి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సోనియా గాంధీ కోలుకోవాలని అన్ని మతాలు వారు పూజలు ప్రార్ధన చేయాలని కోరారు.
వీహెచ్(VH) మాట్లాడుతూ... సోనియా గాంధీ కోలుకోవాలని పూజలు చేశామన్నారు. ‘‘నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా సోనియా కాల్ చేసి మాట్లాడారు. నేను ఆమెని మరవలేను’’ అని అన్నారు. ‘‘మేము పుట్టింది ఇక్కడే.. పెరిగింది ఇక్కడే. మాకు కథలు చెప్పొద్దు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.