Thulasi Reddy: వజ్రోత్సవాలను ఉచ్చరించలేని జగన్.. సీఎం కావడం దౌర్భాగ్యం
ABN , First Publish Date - 2022-08-16T16:54:37+05:30 IST
వజ్రోత్సవాలు అనే అచ్చమైన తెలుగు పదాన్ని ఉచ్చరించలేని జగన్ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వజ్రోత్సవాలు అనే అచ్చమైన తెలుగు పదాన్ని ఉచ్చరించలేని జగన్ (Jagan mohan reddy) తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి (Tulasi reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మానిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95 శాతం అమలు చేసామని చెప్పడం పచ్చి అపధ్ధమన్నారు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మధ్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికేంద్రీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే గ్రామ పంచాయితీలు, తదితర స్థానిక సంస్థలకు విధులు, నిధులు, అధికారాలను బదిలీ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం యావత్తూ అబద్ధాలని తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.