గోబ్యాక్ మోదీ అంటూ Sunkara padmasri నినాదాలు... అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-04T15:29:02+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆందోళనకు దిగారు.

గోబ్యాక్ మోదీ అంటూ Sunkara padmasri నినాదాలు... అరెస్ట్

విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) ఈరోజు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పీఎంకు  వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ (Sunkara padma sri ) ఆందోళనకు దిగారు. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద జాతీయ రహదారిపై బ్లాక్ బెలూన్‌తో గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి మోదీ, జగన్ కలిసి మోసం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... ఎయిర్‌పోర్టు వద్ద పద్మశ్రీని అదుపులోకి తీసుకున్నారు. 


కాగా...మరికాసేపట్లో ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామారాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొని...బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 

Updated Date - 2022-07-04T15:29:02+05:30 IST