మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదు: Sunita rao
ABN , First Publish Date - 2022-06-25T19:19:05+05:30 IST
రాష్ట్రంలో నిత్యావసర ధరలు అన్నీ విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసర ధరలు అన్నీ విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్(Congress) అధ్యక్షురాలు సునీతారావు(Sunita rao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... నిత్యావసర ధరలకు తోడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు మళ్ళీ పెంచే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు మహిళా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తుందని తెలిపారు. తాము కూడా బస్భవన్ ముందు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా సంతోషమే.. చెప్పి చేరితే ఇంకా సంతోషమని సునీతారావు పేర్కొన్నారు.