ఉద్యోగుల పోరాటం సఫలీకృతం కావాలి: Sailajanath

ABN , First Publish Date - 2022-02-03T18:17:55+05:30 IST

అత్యధికమైన పీఆర్సీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు.

ఉద్యోగుల పోరాటం సఫలీకృతం కావాలి: Sailajanath

అనంతపురం: అత్యధికమైన పీఆర్సీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ కోసం ఉద్యోగుల చేస్తున్న పోరాటం సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. బీజేపీ... జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాకు తెరతీసి అమరావతే రాజధాని అని నరేంద్రమోడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడే ధైర్యం లేని పిరికి వాళ్లు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్లు అని వ్యాఖ్యలు చేశారు. 


జగన్ పడుకున్నారో మేలుకున్నారో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. స్టిక్కర్లు వేసుకుని రోడ్లపై తిరగడం, ల్యాండ్ స్కాంలలో ఎమ్మెల్యేలు ఇన్‌వాల్వ్ అవుతూ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. భారతీ సిమెంట్స్ కోసం కాకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన హామీల అమలు కోసం నోరు తెరవాలని డిమాండ్ చేశారు. దేశంలో లౌకికవాదానికి ప్రమాదం వస్తోందన్నారు. దేశ ప్రజల ఆస్తులను ఒకరిద్దరికి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతలో రోడ్ల దుస్థితిపై ప్రత్యక్ష కార్యాచరణకు ఈ నెల 10న ప్రచార కార్యక్రమంతో పాటు కార్యాలయాల ముట్టడి చేయనున్నట్లు శైలజానాథ్ తెలిపారు. 

Updated Date - 2022-02-03T18:17:55+05:30 IST