ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్య: Ponnam
ABN , First Publish Date - 2022-06-14T19:38:36+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భయం పుట్టినప్పుడల్లా గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi)కి భయం పుట్టినప్పుడల్లా గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam prabhakar) మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీలదన్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. ముంబై ఎయిర్పోర్టును ఆధానికి అప్పగించడానికి సీబీఐని ఉపయోగించుకున్నారా? లేదా..? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకులను బీజేపీ... సీబీఐ, ఈడీతో అణిచివేసే ప్రయత్నం చేస్తోందని పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.