రైతుల పాలిట యముడిగా సీఎం మారారు: పొన్నాల లక్ష్మయ్య
ABN , First Publish Date - 2022-05-24T03:54:42+05:30 IST
దేశంలో 80 కోట్ల మందికి ఆహారాధాన్యాలు ఎగుమతి చేసిన ఘనత కాంగ్రెస్దేనని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఓ ప్రకటనలో...
సదాశివపేట: దేశంలో 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఎగుమతి చేసిన ఘనత కాంగ్రెస్దేనని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఓ ప్రకటనలో అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి అక్కడికి వెళ్లారని పొన్నాల ఎద్దేవా చేశారు. తేమ శాతం,తాలు, తరుగు పేరుతో ధాన్యం కొనుగోలు చేసి ట్రాక్ షీట్లు ఇవ్వకుండా రైతులను అధికారులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 17 లక్షల మంది కౌలు రైతులకు పంట నష్టం, పెట్టుబడి సహాయం అందడం లేదన్నారు. తెలంగాణలో కౌలు రైతులకు సీఎం కేసీఆర్ రైతుబంధు ఇవ్వకుండా రైతుల పాలిట యముడిగా మారారని విమర్శించారు.