ఖబడ్దార్ చల్లా.. నిద్రపోయిన సింహాన్ని తట్టిలేపావు: కొండా సురేఖ
ABN , First Publish Date - 2022-01-22T23:00:15+05:30 IST
ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్లో కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక
వరంగల్: ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్లో కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపం ధ్వంసంపై మాజీ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రపోయిన సింహాన్ని తట్టిలేపావు, ఖబడ్దార్ చల్లా ధర్మారెడ్డి అంటూ హెచ్చరించారు. కాచుకో చల్లా ధర్మారెడ్డి నీ భరతం పడతామని సురేఖ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్లు కూడా ఏం చేయలేరని ఆమె అన్నారు. నీ పాపాలు పండేరోజు దగ్గర పడిందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలోని ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్లో టీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో ధ్వంసం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత స్థలంలో నిర్మించుకున్న స్థూపాన్ని ఎలా ధ్వంసం చేస్తారని కొండా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.