కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం: కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2022-04-11T00:38:34+05:30 IST
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటే తన లక్ష్యమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటే తన లక్ష్యమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న మోసాలను ఎండగడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పలికే సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటివరకు నల్లగొండకు పరిమితమైన తన పోరాటాన్ని ఇక రాష్ట్ర వ్యాప్తం చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు భూమి ఇస్తే కేసీఆర్ ఆ భూములను లాక్కొని రియల్ ఎస్టేట్కి ధారాదత్తం చేస్తున్నాడని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. అతివృష్టి, అనావృష్టి వచ్చినా అప్పులపాలై చనిపోయేది కౌలు రైతేనని, దేశంలో ఎక్కడైనా పంటలు పండించే వారిని ప్రభుత్వాలు ఆదుకుంటాయి కానీ తెలంగాణలో భూస్వాములను ఆదుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు.