18న చేవెళ్లలో కాంగ్రెస్ పాదయాత్ర

ABN , First Publish Date - 2021-12-16T21:33:04+05:30 IST

ఈ నెల 18న చేవెళ్లలో టీ. కాంగ్రెస్ ఆధర్వంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పాదయాత్ర చేస్తున్నట్లు

18న చేవెళ్లలో కాంగ్రెస్ పాదయాత్ర

రంగారెడ్డి: ఈ నెల 18న చేవెళ్లలో టీ. కాంగ్రెస్ ఆధర్వంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పాదయాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చేవెళ్ల పాదయాత్రలో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొననున్నారు. ఇదే రోజు అమేథీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్ర చేయనున్నారు. రాహుల్‌, ప్రియాంకకు మద్దతుగా చేవెళ్లలో టి.కాంగ్రెస్‌ పాదయాత్ర చేస్తున్నారు. జనవరిలో భూసంస్కరణలపై మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ పాదయాత్ర చేయనున్నారు. తెలంగాణలో 15 రోజులు మీనాక్షి నటరాజన్‌ పాదయాత్ర చేయనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణలో రాహుల్‌గాంధీ ఒకరోజు పాదయాత్ర చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.

Updated Date - 2021-12-16T21:33:04+05:30 IST