వైసీపీ మంత్రులు ఇంకా కట్టు కథలు చెబుతున్నారు: శైలజానాథ్

ABN , First Publish Date - 2022-05-24T00:34:31+05:30 IST

వైసీపీ మంత్రులు ఇంకా కట్టు కథలు చెబుతున్నారు: శైలజానాథ్

వైసీపీ మంత్రులు ఇంకా కట్టు కథలు చెబుతున్నారు: శైలజానాథ్

అమరావతి: రాష్ట్రంలో దళితులకు రక్షణ ఇదేనా? అని కాంగ్రెస్ నేత శైలజానాథ్  ప్రశ్నించారు. మూడేళ్లలో దళితులకు జగన్ రెడ్డి చేసిన మేలు ఏంటో చెప్పే దమ్ము, ధైర్మం ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు ఇప్పుడు ఏమంటారు? అని ఆయన ప్రశ్నించారు. దళిత ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కొమ్ముకాయడం మాని బాధితులకు అండగా నిలవాలని సూచించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే నిర్భీతిగా హత్యలు చేస్తుంటే దళిత మంత్రులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నా వైసీపీ మంత్రులు ఇంకా కట్టు కథలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-24T00:34:31+05:30 IST