నాగర్ కర్నూల్‎లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2021-04-11T17:40:07+05:30 IST

జిల్లాలోని పెంట్లవెళ్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలకు కమ్యూనిటీ హాల్ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాల...

నాగర్ కర్నూల్‎లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

నాగర్ కర్నూల్: జిల్లాలోని పెంట్లవెళ్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలకు కమ్యూనిటీ హాల్ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఒకరి ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో ఒక వర్గంపై మరో వర్గం పరస్పరం కత్తులతో దాడులకు దిగారు. ఈ దాడులలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను సముజాయించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-04-11T17:40:07+05:30 IST