కానిస్టేబుల్స్కి ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్కు మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2021-09-04T23:18:52+05:30 IST
కోదాడలో ఇద్దరు కానిస్టేబుల్స్కి ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. సెలవులో ఉన్న కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై కారులో మద్యం సేవిస్తున్నారు....
సూర్యాపేట: కోదాడలో ఇద్దరు కానిస్టేబుల్స్కి ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. సెలవులో ఉన్న కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై కారులో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో ఓ ప్రైవేట్ డాక్టర్ తన కారులో అటుగా వెళుతున్నారు. కారుకు దారి ఇచ్చే విషయంలో కానిస్టేబుళ్లతో ఆయనకు ఘర్షణ జరిగింది. మద్యం సేవిస్తున్న కానిస్టేబుల్స్కు ట్రాఫిక్ ఎస్ఐ క్రాంతికుమార్ వత్తాసు పలికారు. అయితే స్థానికులు మాత్రం డాక్టర్కు మద్దతుగా మాట్లాడుతూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే పలువురికి గాయాలయ్యాయి. ఆనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో డాక్టర్ ఫిర్యాదు చేశారు.