జీతాలు ఇవ్వకపోవడంపై విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2022-02-09T01:38:21+05:30 IST

జీతాలు ఇవ్వకపోవడంపై విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

జీతాలు ఇవ్వకపోవడంపై విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

అమరావతి: తమ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. లంచ్‌ అవర్‌ ఆందోళనలో విద్యుత్‌ సౌధా సిబ్బంది పాల్గొన్నారు. జెన్‌కో ఉద్యోగులకు నేటి వరకూ జీతాలు ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెన్షనర్లకు కూడా పెన్షన్‌లు వేయలేదంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటీకరణకు నిరసనగా దశలవారీగా విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

Updated Date - 2022-02-09T01:38:21+05:30 IST