ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష పూర్తి
ABN , First Publish Date - 2022-08-08T08:48:04+05:30 IST
ఎస్ఐ సివిల్, తత్సమాన పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ప్రిలిమినరీ రాత పరీక్షకు 2,25,759 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
2,25,759 మంది హాజరు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఎస్ఐ సివిల్, తత్సమాన పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ప్రిలిమినరీ రాత పరీక్షకు 2,25,759 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 503 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 (91.32 శాతం) మంది పరీక్ష రాసినట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.