కరీంనగర్ సీపీపై జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-01-05T23:04:32+05:30 IST

కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణపై జాతీయ

కరీంనగర్ సీపీపై జాతీయ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు

హైదరాబాద్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణపై జాతీయ బీసీ కమిషన్‌కు బీజేపీ ఓబీసీ మోర్చా ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా  సీపీ దురుసుగా ప్రవర్తించడంపై ఫిర్యాదు చేసింది. సీపీ సత్యనారాయణ సీఎం ఇచ్చిన స్క్రిప్టు అమలు చేస్తున్నారని ఓబీసీ మోర్చా ఆరోపించింది. వెంటనే సీపీపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్‌ను కోరింది. 


Updated Date - 2022-01-05T23:04:32+05:30 IST