సూర్యలంక బీచ్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి: బాబురావు
ABN , First Publish Date - 2022-10-06T01:18:37+05:30 IST
సూర్యలంక బీచ్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి: బాబురావు
విజయవాడ: బాపట్ల సూర్యలంక బీచ్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సింగ్నగర్లో కుటుంబసభ్యుల ఆందోళనకు దిగారు. మృతులంతా పేద కుటుంబాలవారు కావడంతో రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగ్నగర్ శాంతినగర్ సెంటర్లో మృతదేహాలతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం నేత బాబురావు డిమాండ్ చేశారు.