కరోనాతో మరణిస్తే కోటి పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-08-13T07:40:12+05:30 IST

కరోనా సోకి మృతి చెందిన జీహెచ్‌ఎంసీ కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

కరోనాతో మరణిస్తే కోటి పరిహారం ఇవ్వాలి

  • జీహెచ్‌ఎంసీ కార్మికుల ధర్నా 

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 12 (ఆం ధ్రజ్యోతి): కరోనా సోకి మృతి చెందిన జీహెచ్‌ఎంసీ కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆ సంస్థ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఊదరి గోపాల్‌ డిమాండ్‌ చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలను జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ.. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట పారిశుధ్య, ఎంటమాలజీ కార్మికులు ధర్నా చేశారు.  కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రూ.25 వేల జీతమివ్వాలని గోపాల్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-08-13T07:40:12+05:30 IST