జూనియర్‌ కాలేజీలపై మార్గదర్శకాలకు కమిటీ

ABN , First Publish Date - 2020-07-14T08:10:55+05:30 IST

జూనియర్‌ కాలేజీలపై మార్గదర్శకాలకు కమిటీ

జూనియర్‌ కాలేజీలపై మార్గదర్శకాలకు కమిటీ

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): జూనియర్‌ కాలేజీలకు సంబంధించిన అఫిలియేషన్‌ మార్గదర్శకాలు, నిబంధనలకు తుది రూపు ఇచ్చేందుకు నలుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యా చట్టం -1971కు అనుగుణంగా నూతనంగా రూపకల్పన చేసిన మార్గదర్శకాలు, నిబంధనలకు ఈ కమిటీ తుది రూపు ఇవ్వనుంది. ఇంటర్‌ విద్య స్పెషల్‌ కమిషనర్‌, పాఠశాల విద్య కమిషనర్‌లతోపాటు ఇంగ్లీషు మీడియం ప్రాజె క్టు స్పెషల్‌ ఆఫీసర్‌ కె.వెట్రిసెల్వి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌తో ఏర్పాటైన ఈ కమిటీ ఈ నెల 20లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2020-07-14T08:10:55+05:30 IST