కోడి పందేలు.. పది మంది అరెస్ట్
ABN , First Publish Date - 2020-07-06T02:48:35+05:30 IST
కోడి పందేలు నిర్వహిస్తున్న పది మంది నిర్వాహకులను అదుపులోకి కీసర పోలీసులు అదుపులోకి ..
మేడ్చల్: కోడి పందేలు నిర్వహిస్తున్న పది మంది నిర్వాహకులను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. 9 పందెపు కోళ్లతో పాటు, 14 బైకులు, రూ. 17 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రాంపల్లి దాయర పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. సీఐ నరేందర్ ఆదేశాల మేరకు కోడి పందేల శిబిరాలపై దాడి చేశారు.