Tomorrow గణపవరంలో సీఎం పర్యటన
ABN , First Publish Date - 2022-05-16T02:52:04+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం ఏలూరుజిల్లా గణపవరం రానున్నారు. గణపవరంలో రైతు భరోసా చెక్కుల పంపిణీ
గణపవరం: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం ఏలూరుజిల్లా గణపవరం రానున్నారు. గణపవరంలో రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పాల్గొనే సభాప్రాంగణాన్ని, ఏర్పాట్లను ఆదివారం జిల్లా ఇన్చార్జి మంత్రి పి.విశ్వరూప్, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. సభావేదిక నిర్మాణ పనులు వీఐపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్న 16 గ్యాలరీలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.