కేసినో వివాదంపై సీఎం సమాధానం చెప్పాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-01-25T08:58:52+05:30 IST

గుడివాడ కేసినో వివాదంపై ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం డిమాండ్‌ చేశారు.

కేసినో వివాదంపై సీఎం సమాధానం చెప్పాలి: రామకృష్ణ

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గుడివాడ కేసినో వివాదంపై ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారం డిమాండ్‌ చేశారు. ‘‘కేసినో అనేది ఒక ప్రమాదకరమైన జూద క్రీడ. అటువంటి కేసినో గుడివాడలో నిర్వహించారనే వార్తలు ఐదు రోజులుగా వివాదం రేపుతున్నాయి. ఆ వివాదంపై నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా సీఎం స్పందించాలి. కేసినో నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గుడివాడ డీఎస్పీని సస్పెండ్‌ చేయాలి’’ అని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-01-25T08:58:52+05:30 IST