విశాఖ ఏజెన్సీలో పర్యటించిన సీఎం ప్రధాన కార్యదర్శి
ABN , First Publish Date - 2020-08-05T03:43:21+05:30 IST
సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం విశాఖ ఏజెన్సీలో పర్యటించారు. చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురం గ్రామం వన సంరక్షణ సమితిని పరిశీలించారు.
విశాఖపట్నం: సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం విశాఖ ఏజెన్సీలో పర్యటించారు. చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురం గ్రామం వన సంరక్షణ సమితిని పరిశీలించారు. మన్యంలోని వనసంరక్షణ సమితి భూములకు, కాఫీ తోటలకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేసి పేదరికాన్ని నిర్ములించాలన్నారు. గిరిజన రైతులకు సిల్వర్ మొక్కలు, కాఫీ మొక్కలు సరఫరా చేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా, పిసిసి ఎఫ్ ప్రతీప్ కుమార్, ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ సలిజామల, ఇతర అధికారులు పాల్గొన్నారు.