LIVE..: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన

ABN , First Publish Date - 2021-03-04T18:11:45+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం సందర్శించనున్నారు.

LIVE..: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన

యాదాద్రి: దేశంలోనే అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం సందర్శించనున్నారు. యాదాద్రి కొండపై ఆలయ ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల అభివృద్ధి పనులు తుది దశకు చేరి ఉద్ఘాటనకు సిద్ధమవుతున్న తరుణంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కొండపై బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రధానాలయం, కొండపై పరిసరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పురోగతిని పరిశీలిస్తారు. మూడు నెలల్లో ప్రధానాలయ ఉద్ఘాటన చేసి, స్వామి గర్భాలయ దర్శనాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్..

Updated Date - 2021-03-04T18:11:45+05:30 IST