ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ABN , First Publish Date - 2020-06-03T02:23:52+05:30 IST
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని...
హైదరాబాద్: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ కోరారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లును సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
ఈ బిల్లు పాస్ అవకుండా పార్లమెంట్లో పోరాడుతామని ప్రకటించారు. విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలు తెలిపేందుకు జూన్ 5 వరకూ కేంద్రం గడువు విధించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధానికి ఈ లేఖ రాశారు.