11న జనగామకు సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-02-10T21:15:32+05:30 IST
సీఎం కేసీఆర్ ఈ నెల 11న (శుక్రవారం) జిల్లాలో పర్యటించనున్నారు. సమీకృత
జనగామ: సీఎం కేసీఆర్ ఈ నెల 11న (శుక్రవారం) జిల్లాలో పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో లక్షా 30 వేల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరిశీలించారు.
ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. నిన్న టీఆర్ఎస్, బీజేపీ నాయకులు కొట్టుకున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు బీజేపీ నాయకులు అడ్డుపడతారని ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.