కావేటి సమ్మయ్య మృతికి కేసీఆర్ దిగ్ర్భాంతి
ABN , First Publish Date - 2020-04-09T20:38:20+05:30 IST
టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.