నల్గొండకు కేసీఆర్ వరాల జల్లు

ABN , First Publish Date - 2022-04-28T21:59:37+05:30 IST

నల్గొండకు సీఎం కేసీఆర్ మరిన్ని వరాలను

నల్గొండకు కేసీఆర్ వరాల జల్లు

నల్గొండ: నల్గొండకు సీఎం కేసీఆర్ మరిన్ని వరాలను ప్రకటించారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కేసీఆర్‌ పరామర్శించారు. అనంతరం నార్కట్‌పల్లిలో నల్గొండ పట్టణ అభివృద్ధి, నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని ఎత్తిపోతల పథకాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నల్గొండ-మర్రిగూడెం ఫ్లైఓవర్‌కు రూ.50 కోట్లను మంజూరు చేశారు. అలాగే ఎస్ఎల్బీసీలో సీఈ ఆఫీస్‌ను మంజూరు చేశారు. ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్ స్థానంలో కొత్తగా నాలుగు ఫోర్లతో అధునాతన అతిథి గృహాన్ని నిర్మించడానికి అంగీకరించారు. నల్గొండ కళాభారతి, నల్గొండ టాంక్‌బండ్‌ల డిజైన్లను ఖరారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నల్గొండ అభివృద్ధికి నీలగిరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నార్కట్ పల్లి నుంచి హైదరాబాద్‌కు కేసీఆర్ బయల్దేరారు.

Updated Date - 2022-04-28T21:59:37+05:30 IST