సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ సమీక్ష
ABN , First Publish Date - 2020-04-05T19:30:06+05:30 IST
తెలంగాణలో కరోనా కేసులు, నివారణ చర్యలు, రాష్ట్రంలో పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు, నివారణ చర్యలు, రాష్ట్రంలో పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశానికి ప్రగతి భవన్ వేదిక కానుంది. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
కాగా.. ప్రధాని పిలుపు మేరకు ప్రగతి భవన్లో దీప యజ్ఞంలో కేసీఆర్ పాల్గొననున్నారు. కేసీఆర్తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.